Header Banner

విజయవాడలో దారుణ హత్య! పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టిన వివాహేతర సంబంధం!

  Mon Mar 03, 2025 10:15        Others

విజయవాడలోని నిడమానూరులో ఓ మహిళను ఆమె ప్రియుడు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. కావ్య అనే మహిళకు వాసు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. భర్త ప్రకాష్ ఆమెను మందలించిన తర్వాత కూడా వాసు ఆమెను వేధించడంతో, ఆగ్రహించిన వాసు ఆమెను చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!

 

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. వాటి కారణంగా పచ్చటి కాపురాల్లో చిచ్చులే కాకుండా కొన్ని సార్లు జీవితాలే బలవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. చక్కగా భర్త, పిల్లలు ఉన్న ఆమె జీవితంలోకి స్నేహం పేరుతో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత వివాహేతర సంబంధంగా మారి.. చివరి ఆమె ప్రాణాలు తీసే కాల యముడు కూడా అతనే అయ్యాడు. అన్యాయంగా మహిళను చంపి హంతకుడిగా మారాడు. ఈ ఘటన విజయవాడలోని నిడమానూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాష్ , కావ్య అనే దంపతులు కొంతకాలంగా నిడమానూరులో కాపురం ఉంటున్నారు. కావ్య రెయిన్‌బో హాస్పిటల్ లో గతంలో ఆయా గా పని చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆ సమయంలోనే నిడమానూరుకు చెందిన వాసు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. తరువాత కొంతకాలం ఫోన్లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఈ విషయం కావ్య భర్త ప్రకాష్‌కు తెలిసిందే. భార్య చేస్తున్న ఈ పనికి ఎంతో బాధపడిన ప్రకాష్‌.. ఇలా చేయడం సరికాదని, ఇకనైనా మంచిగా ఉండాలంటూ ఆమెను మందలించి, ఆ హాస్పిటల్లో ఆయా ఉద్యోగం మాన్పించి ఇంటి వద్దే ఉంచాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా.. మళ్లీ ప్రియుడు వాసు తరచూ ఫోన్లు చేస్తూ.. తనతో ఫోన్లో మాట్లాడాలని, వివాహేతర బంధం కొనసాగించాలని ఒత్తిడి తెచ్చాడు.

 

అయితే భర్త భయంతో ఆమె వాసును దూరం పెట్టడంతో ఈ విషయంలో తీవ్రంగా ఆగ్రహించిన వాసు అనేకు మార్లు నాతో ఫోన్ మాట్లాడమని లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఇక చివరికి ఆదివారం అంటే మార్చ్‌ 2, 2025 తెల్లవారుజామున ప్రకాష్‌ ఇంట్లో లేని సమయంలో కావ్య ఇంటికి వెళ్లాడు వాసు. నీతో కాస్త ఏకాంతంగా మాట్లాడలని, ఆమెను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఏమైందో ఏమో కానీ, ఆమె మెడకు చున్నీతో గట్టిగా బిగించి, చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై మృతురాలి భర్త ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!


పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!


పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!


శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..


రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #education #APStudents #Academic#VijayawadaCrime #ShockingMurder #LoveAffairGoneWrong #CrimeNews #AffairTurnsDeadly #ExtramaritalTragedy #JusticeForKavya #CrimeAlert #VijayawadaNews #RelationshipCrime